అమరావతి: ఏపీ సర్కారు మరోసారి అఖిలపక్షానికి పిలుపునిచ్చింది. కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఇవాళ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. ఈ అఖిలపక్షం భేటీలో వచ్చే సలహాలు, సూచనలు మేరకు తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. కాగా అఖిలపక్షానికి రాబోమని ఇప్పటికే బీజేపీ, వైసీపీ, జనసేన, వామపక్షాలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్ కూడా అఖిలపక్షానికి దూరంగా ఉండనుంది.