ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాద్ సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. శాసనసభలో ఇవాళ ప్రభుత్వం నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభలో ఇవాళ విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులపై లఘు చర్చ జరగనుంది. అలాగే శాసన మండలిలో ఒప్పంద, పొరుగసేవల ఉద్యోగుల సంక్షేమంపై లఘుచర్చ జరగనుంది.