న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మురళీమనోహర్ జోషి తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీకి కేంద్రంలోని మోడీ సర్కార్ చేసిన అన్యాయం గురించి వివరించారు. మిత్రపక్షంగా ఉన్నా ఏపీకి విభజన హామీల అమలులో కేంద్రం దారుణంగా వ్యవహరించిందని వివరించారు. విభజన హామీలపై రూపొందించిన నివేదికను ఆయనకు అందజేశారు. ఏపీకి న్యాయం కోసమే తాము ఎన్డీయేలో నుంచి బయటకు వచ్చి పోరుబాట పట్టామని చంద్రబాబు మురళీమనోహర్ జోషికి చెప్పారు.