సీబీఎస్ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనపై నిరసనలతో దేశరాజధాని అట్టుడుకుతోంది. శనివారం దిల్లీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పలు రహదారులను దిగ్బంధం చేసి తమ నిరసన తెలియజేశారు. ప్రీత్ విహార్లో వాహనాలను విద్యార్థులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ యువజన నేతలు.. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అండగా నిలిచారు. పది వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని.. ఇప్పటి వరకూ 60 మందిని విచారించినట్లు పోలీసులు చెబుతున్నారు.