ప్రఖ్యాత హాలీవుడ్ డైరక్టర్ క్రిస్టోఫర్ నోలన్ను సూపర్స్టార్ కమల్హాసన్ కలిశారు. సినిమా భవిష్యత్తు అనే అంశంపై జరుగుతున్న సదస్సులో పాల్గొనేందుకు నోలన్ ముంబై వచ్చారు. అక్కడ నోలన్ను శుక్రవారం నాడు ప్రత్యేకంగా కమల్ కలుసుకున్నారు. నోలన్ డైరక్షన్ చేసిన డంకిర్క్ సినిమాను డిజిటల్ ఫార్మాట్లో చూశానని కమల్ తన ట్వీట్లో తెలిపాడు. తాను తీసిన హే రామ్ చిత్రానికి సంబంధించిన డిజిటల్ ఫార్మాట్ను నోలన్కు చూడమని ఇచ్చినట్లు కమల్ చెప్పాడు. శివేంద్ర సింగ్ దుంగార్పూర్కు చెందిన ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ముంబైలో మూడు రోజుల పాటు సెమినార్ను ఏర్పాటు చేసింది. హాలీవుడ్ విజువల్ ఆర్టిస్ట్ టసిటా డీన్ కూడా ఈ సెమినార్లో మాట్లాడనున్నారు. ప్రఖ్యాత నటులు అమితాబ్, షారుక్, కమల్, శ్యామ్ బెనగల్లు రౌండ్టేబుల్ చర్చలో పాల్గోనున్నారు. నోలన్ తీసిన డంకిర్క్, ఇంటర్స్టెల్లార్ చిత్రాలను ప్రదర్శించనున్నారు.