గుంటూరు: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర 125వ రోజుకు చేరింది. తాడికొండ నియోజకవర్గం మేడికొండూరులో జగన్ పాదయాత్ర సాగనుండగా.. సాయంత్రం పేరేచర్లలో జగన్ బహిరంగసభలో పాల్గొననున్నారు. కాగా.. జగన్ ఇప్పటివరకు 1600కిలోమీటర్లకు పైగా పాదయాత్రను చేశారు. ఈ యాత్రలో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.