లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఆరు ప్రాంతాల్లో గడిచిన 24 గంటల వ్యవధిలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు హతమవ్వగా మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా హత్యలు, దోపిడీ కేసులలో నిందితులు, క్యాష్ రివార్డ్తో వాంటెడ్గా ఉన్నవారే. నోయిడా ఎన్కౌంటర్లో శరవన్ చౌదరి హతమయ్యాడు. ఇతడు నోయిడా, ఢిల్లీలోని పలు హత్య కేసులో వాంటెడ్గా ఉన్నాడు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే-47 రైఫిల్, సింగిల్ బ్యారెల్డ్ గన్ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా షహరాపూర్లో జరిగిన మరో పోలీస్ యాక్షన్లో ఆశన్ అనే వ్యక్తి హతమయ్యాడు. గడిచిన రాత్రి 12.10 ప్రాంతంలో పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మోటార్ సైకిల్పై వచ్చిన వ్యక్తి నగదు ఉన్న బ్యాగ్ను అపహరించుకుపోతున్నట్లుగా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వివిధ ప్రాంతాల్లోని అన్ని చెక్పోస్టులను అలర్ట్ చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆరుచోట్ల ఎన్కౌంటర్ ఘటన చోటుచేసుకుంది.