పార్లమెంటు ఉభయ సభలూ ప్రారంభమయ్యాయి. లోక్ సభ ప్రారంభమైన వెంటనే సభ్యుల ఆందోళనలు ప్రారంభించడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. లోక్ సభలో తెలుగుదేశం, వైకాపాల అవిశ్వాస తీర్మానాలు చర్చకు వచ్చే అవకాశం లేనట్లే కనిపిస్తున్నది. ఈ ఉదయం లోక్ సభ ప్రారంభమైన 30 సెకండ్లకే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు. సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. వివిధ అంశాలపై పలు విపక్ష పార్టీలు వెల్ లోకి దూసుకు వెళ్లి ఆందోళన చేస్తుండటంతో ఆమె సభన మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అయితే పరిస్థితి ఇలాగే ఉన్న సమయంలో ఆర్థిక బిల్లు సహా పలు బిల్లులను సభ ఆమెదించినట్లు ప్రకటించిన స్పీకర్ అవిశ్వాస తీర్మానం విషయంలో సభ ఆర్డర్ లో ఉండాలంటూ కండీషన్ పెట్టడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.