ఏపీ శాసన మండలిలో టీడీపీ సీనియర్ నాయకుడు గాలిముద్దుకృష్ణమ నాయుడికి నివాళి అర్పించారు. ముద్దుకృష్ణమ నాయుడికి శాసన మండలిలో సంతాప తీర్మానం చేశారు. మంత్రి సోమిరెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ మృతి చాలా బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శాసన మండలిలో చంద్రబాబు మాట్లాడుతూ… ఎన్టీఆర్ పిలుపు ఇస్తే ముద్దుకృష్ణమ 1982లో పార్టీలో చేరారని గుర్తు చేశారు. ముద్దుకృష్ణమ రాజకీయాల్లోఅంచెలంచెలుగా ఎదిగారన్నారు. ముద్దుకృష్నమ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, మూడుసార్లు మంత్రిగా పని చేశారన్నారు.