తిరుమల: తిరుమల శ్రీవారిని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహేంద రాజపక్సే దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామి వారిని దర్శించుకోని మ్రొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు దగ్గరుండి రాజపక్సేకి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంనాయకుల మండపంలో వేదపండితులచే వేదాశీర్వచనం అందించి.. స్వామి వారి తీర్దప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందజేశారు.