హిమాచల్ప్రదేశ్ : మండి జిల్లా సుందర్నగర్ వద్ద బస్సు ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా, 32 మంది గాయపడ్డారు. ప్రమాదాన్ని గ్రహించి అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను సుందర్ నగర్లోని ఆ ఆస్పత్రికి తరలించారు.