శ్రీనగర్ : పాకిస్థాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. రాజౌరి, నౌషెరా సెక్టార్లో పాక్ బలగాలు కాల్పులకు పాల్పడుతున్నాయి. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. సరిహద్దులోని గ్రామాల ప్రజలను బలగాలు.. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బోర్డర్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెల్లదీస్తున్నారు.