సీఐఐ, ఆంధ్రప్రదేశ్ సంయుక్త భాగస్వామ్యం చాలా గొప్పదని పారిశ్రామిక వేత్త శోభనా కామినేని అన్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం, ప్రజలు కలిసి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. అందరూ కలిసి పనిచేసేందుకు భాగస్వామ్య సదస్సు ఉపకరిస్తుందని చెప్పారు.
భారత్, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయి చెప్పారు. ఒకే మార్కెట్ గా అవతరించేందుకు జీఎస్టీ ఉపకరిస్తుందన్న శోభనా కామినేని..జీఎస్టీ వల్ల దేశంలో మరింత వృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. చిన్న తరహా పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరుగుతోందని, యువత ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని శోభనా ఆకాంక్షించారు. దావోస్ లో పర్యటించిన సమయంలో సీఎం చంద్రబాబును గమనించానని, పెట్టుబడుల విషయమై వరుస సెషన్లు నిర్వహిస్తూనే ఉన్నారని అన్నారు. ఏపీ సాంకేతిక గురించి ప్రపంచానికి చాటి చెప్పారని చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.