ఏపీ సర్కార్ విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సదస్సు ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సదస్సును ప్రారంభించారు. దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడులే ఆకర్షణగా ఏపీ సర్కార్ ఈ సదస్సును నిర్వహిస్తుంది. సదస్సుకు 40 దేశాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. భాగస్వామ్య సదస్సులో 11 అంశాలపై ప్లీనరీ సెషన్లు జరగనున్నాయి. ఇవాళ్ట నుంచి మూడు రోజుల పాటు జరగనున్న సదస్సు… ఈ నెల 26న ముగియనుంది. ఈ కార్యక్రమానికి ఉప రాష్ర్టపతి వెంకయ్యతో పాటు కేంద్రమంత్రి సురేష్ ప్రభు, అశోక్ గజపతిరాజు , రాష్ర్టమంత్రులు పాల్గొన్నారు. సాయంత్రం 5గంటలకు సన్రైజ్ ఆంధ్రప్రదేశ్పై సదస్సు జరుగనుంది