తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 5 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 61,503 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,115 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.63 కోట్లుగా ఉంది.