న్యూఢిల్లీ: పలు వివాదాల మధ్య కొనసాగుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పర్యటన తుది దశకు చేరుకుంది. పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన తన భార్య, పిల్లలతో సహా న్యూఢిల్లీకి చేరుకోగా, అక్కడ వారికి సాదర స్వాగతం లభించింది. ఆయన్ను చూడగానే ప్రధాని మోదీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం తన కార్యాలయానికి తీసుకెళ్లి ట్రూడోతో భేటీ అయ్యారు. వీరి భేటీలో ఉగ్రవాదం, ఇండియా, కెనడాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తదితరుల విషయాలు ముఖ్యంగా చర్చకు రానున్నాయి. అయితే ట్రూడో భారత్కు వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ కానీ, ఆయా రాష్ట్రాల సీఎంలు కానీ అతడిని పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు కురిసిన విషయం తెలిసిందే.