శ్రీకాకుళం : ఎర్రన్నాయుడు 61వ జయంతి సందర్భంగా నిమ్మాడ ఎర్రన్నాయుడు ఘాట్ దగ్గర రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాలం ఆశోక్ కుటుంబసభ్యులు, కింజరాపు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు శుక్రవారం ఉదయం నివాళి అర్పించారు.