తిరుమల: తిరుమల ఏడుకొండలవాడిదర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 66,814 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,715 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.71 కోట్లుగా ఉంది.