ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా సాధికారతకు రైల్వేలో మరో ముందడుగు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2018, 10:42 AM

జైపూర్: రైల్వే సంస్థలో మహిళా సాధికారతకు మరో ముందడుగు పడింది. రాజస్థాన్‌లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ నిర్వహణ మొత్తం మహిళా సిబ్బందిచే నడిపేందుకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని విభాగాల్లో మహిళా ఉద్యోగులను నియమించి బాధ్యతలు అప్పగించారు. దీంతో దేశంలోనే మహిళా ఉద్యోగినులతో నిర్వహింపబడుతున్న రైల్వేస్టేషన్ గా గాంధీనగర్ రైల్వే స్టేషన్ నిలిచింది. మొత్తం 28 మంది మహిళలు స్టేషన్ నిర్వహణ చూస్తున్నారు. టికెట్ తనిఖీ, ఆర్‌పీఎఫ్, ఆపరేషన్స్ స్టాఫ్, రిజర్వేషన్స్, బుకింగ్ సుపర్‌వైజర్స్ ఇలా అన్ని విభాగాలను మహిళా ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. జైపూర్-ఢిల్లీ మార్గంలోని ఈ రైల్వే స్టేషన్ గుండా 50 రైళ్లు నడుస్తాయి. స్టేషన్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు శానిటరీ న్యాప్‌కిన్ వెండింగ్ మెషిన్స్‌ను ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com