నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 87వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 87వ రోజు పాదయాత్రను ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి శివారు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర కృష్ణారెడ్డిపాలెం, కుడుములదిన్నె పాడు, తెల్లపాడు క్రాస్, చిన్న అన్నలూరు, మావిడాళ్లపాలెం మీదుగా జంగాలపల్లి వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా జంగాలపల్లిలో జగన్ ప్రజలతో మమేకం కానున్నారు.