టెలికాం సంస్థ ఎయిర్టెల్ శాంసంగ్తో కలిసి వినియోగదారులకు బంపర్ ఆఫర్ను అందిస్తున్నది. దీని ప్రకారం వినియోగదారులు శాంసంగ్కు చెందిన గెలాక్సీ జె సిరీస్ స్మార్ట్ఫోన్లను కొంటే వారికి రూ.1500 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అయితే క్యాష్బ్యాక్ రావాలంటే వినియోగదారులు మొదట 12 నెలలకు కలిపి రూ.2500 కన్నా ఎక్కువ విలువ గల ప్లాన్లను రీచార్జి చేసుకుని ఉండాలి. దీంతో రూ.300 క్యాష్బ్యాక్ వస్తుంది. ఇక తరువాత 12 నెలలు కూడా ఇలాగే చేస్తే మరో రూ.1200 క్యాష్బ్యాక్ ఇస్తారు. శాంసంగ్కు చెందిన గెలాక్సీ జె2, జె5 ప్రైమ్, జె7 ప్రైమ్, జె7 ప్రొ ఫోన్లను కొన్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.