లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం ప్రారంభించిన తరువాత కూడా తెలుగుదేశం ఎంపీల ఆందోళన ఆగలేదు. ప్రధాని ప్రసంగం సమయంలో ఆందోళన వద్దన్న కేంద్ర మంత్రుల వినతిని తెలుగుదేశం ఎంపీలు పట్టించుకొలేదు. ఇలా ఉండగా తెలుగుదేశం ఎంపీల ఆందోళనక కాంగ్రెస్ మద్దతుగా నిలవడం విశేషం. ఒక దశలో స్పీకర్ తీరును కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు.మోడీ ప్రసంగాన్ని అడ్డుకుంటూ తెలుగుదేశం ఎంపీలు నినాదాలతో సభను హోరెత్తిస్తున్నారు.