కర్నూలు : కర్నూలు జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు బయటపడింది. నాగలూటీ చెంచు గూడెం వద్ద మావోయిస్టుల డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డంప్లో ఒక లైవ్ గ్రనేడ్, జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల డంప్ లభ్యం కావడంతో పోలీసులు అక్కడ నిఘా పెట్టారు. కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు సమాచారం.