ఏపీ సీఎం జగన్ వైఎస్సార్ చేయూత మూడో విడత నిధులను శుక్రవారం విడుదల చేశారు. కంప్యూటర్ బటన్ నొక్కి రాష్ట్రవ్యాప్తంగా 26,39,703 మంది మహిళల ఖాతాల్లో రూ.4,949.44 కోట్ల ఆర్థికసాయాన్ని జమ చేశారు. ఈ పథకం కింద 45-60 ఏళ్ల వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే.