ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 24, 2018, 09:03 AM

తిరుమల: తిరుమలలో రథసప్తమి వేడుకలు బ్రహ్మోత్సవాన్ని తలపించేలా ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు ఉదయం 5 గంటలకు సూర్యప్రభవాహనం కన్నులపండువగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వరస్వామి శ్రీమలయప్ప స్వామి అవతారంలో నాలుగుమాడా వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్నారు.ఆది దేవుడు శ్రీనివాసుడు కాబట్టి ఆ సూర్యున్నే వాహనంగా చేసుకుని తిరుమల వీధుల్లో తిరుమల శ్రీవారు ఊరేగుతారు. ఈ రధసప్తమీ రోజు ఉదయం జరిగే మొదటి వాహనం సూర్యప్రభ వాహనం. వాహనం ప్రారంభమైన సమయంలో తిరుమలేశుడు ఆలయం నుండి బయలు దేరి తిరువీదుల్లో ఊరేగుతూ తూర్పు మాడవీధుల నుండి ఉత్తరం మాడవీధుల గుండా పడమర మాడవీధులకు చేరుతారు. ఆ తరువాత దక్షిణ మాడవీధుల వద్దకు రాగానే సూర్య భగవానుడు నేరుగా తన ఉషోదయ కిరణాలతో స్వామి వారి పాదాలపై పడి ఆంజలి గటించి, ఆశీర్వచనం తీసుకుంటారు. తాను ఈ భూలోకానికి వెలుగును నింపే దేవుడే అయినప్పటికీ... ఈ జగత్ అంటే ఈ భూ మండలాన్ని పరిపాలించేది మాత్రం తిరుమలేశుడే కనుక. ముందుగా స్వామి వారికి ఆంజలి గటించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తీసుకుంటాడు సూర్య బగవానుడు. తిరుమలలో జరిగే ఈ సన్నివేశం కళ్లారా చూడ్డానికి ఆ సమయంలో భక్తులు తిరువీధుల్లో పెద్దెత్తున చేరుకుంటారు. కర్పూర హారతులతో స్వామివారికి నీరాజనాలు పలుకుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com