గుంటూరు: దళితుల గురించి జగన్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వు వస్తుందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గుంటూరులో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇడుపులపాయ లో దళితుల భూములు దోచుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానిదన్నారు.దళితుల భూముల్లోనే రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి సమాదులు నిర్మించారన్నారు. అసెంబ్లీ లో దళితుల భూములు తిరిగిస్తానని వైఎస్ చెప్పిన మాట ఏమైందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. దళితుల ను దోపిడి చేసి బతికే కుటుంబం వైఎస్ కుటుంబమన్నారు. వైఎస్ కుటుంబం అంతా దళిత ద్రోహులన్నారు. దళిత అభివ అద్ధి - సంక్షేమం టిడిపి తోనే సాధ్యమవుతుందన్నారు.చంద్రబాబు సారధ్యంలో దళితులు సంతోషంగా జీవిస్తున్నారు. దోపిడిదారుడు , దుర్మర్గుడైన వైఎస్ విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహం పక్కన పెట్టడం సిగ్గుచేటన్నారు. జగన్ కు దమ్ముంటే దళితుల సంక్షేమం పై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.