2019కి ఎట్టి పరిస్థితుల్లోనైనా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. డయాఫ్రంవాల్, దిగువ కాఫర్ డ్యాం పనులను మంత్రి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…2009 నుంచి 2013వరకు పోలవరం పనులు ఎందుకు ఆగాయో జగన్ ప్రజలకు తెలపాలన్నారు. అమరావతి నిర్మాణం రెండేళ్లు జాప్యం జరగడానికి కోర్టులో కేసు వేసింది వైకాపా కాదా అని మంత్రి ప్రశ్నించారు.