ట్రెండింగ్
Epaper    English    தமிழ்

900Km దాటిన జగన్ పాదయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2018, 10:47 AM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లె వద్ద జగన్ 900 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. గత ఏడాది నవంబర్ నెలలో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో జగన్ పాదయాత్ర ఆరంభం అయిన సంగతి తెలిసిందే. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా సాగిన జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో సాగుతోంది.


ఈ పాదయాత్రలో జగన్ ఇప్పటి వరకూ సుమారు 27 అసెంబ్లీ నియోజకవర్గాలను దాటుకుని వచ్చారు. కర్నూలు ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి వద్ద జగన్ పాదయాత్ర వంద కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత అదే జిల్లాలోని డోన్ వద్ద రెండు వందల కిలోమీటర్ల మైలురాయిని దాటారు జగన్. ఆ పై డోన్ వద్ద మూడువందల కిలోమీటర్ల మైలురాయిని, అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో నాలుగువందల, ఆ జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో ఐదువందల, కదిరి నియోజకవర్గంలో ఆరువందల, చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ఏడువందల, గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో ఎనిమిది వందల కిలోమీటర్ల మైలురాళ్లను దాటారు జగన్.


ప్రతి వంద కిలోమీటర్ల మైలురాయిని దాటి చోటళ్లా జగన్ ఒక చెట్టును నాటుతూ వస్తున్నారు. పాదయాత్రలో జగన్ ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శల జోరు పెంచుతున్నారు. చంద్రబాబు పాలనతో ఎవ్వరూ సంతోషంగా లేరనే మాటను చెబుతున్నారు. తమ ప్రభుత్వం వస్తే అమల్లోకి తెచ్చే ‘నవరత్నాల’ గురించి జగన్ వివరిస్తూ వస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com