ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాహిత దారుణ హత్య

Crime |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 10:02 AM

భర్త అకాల మృతితో ఆ మహిళ కన్నవారి ఇంట్లోనే ఉంటోంది. వృద్ధుడైన తండ్రి అలనాపాలనా చూసుకుంటోంది. ఆటువంటి ఆమె దారుణ హత్యకు గురైంది.   ముచ్చర్లవలసలో శనివారం జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముచ్చర్లవలస గ్రామంలో సేనాపతి పైడయ్య అనే వృద్ధుడు కుమార్తె రవణమ్మ (35)తో కలిసి ఉంటున్నాడు. రవణమ్మకు తెర్లాం మండలం ఎంఆర్‌ అగ్రహారానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కానీ భర్త రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందడంతో రవణమ్మ అప్పటి నుంచి తండ్రి ఇంట్లోనే ఆశ్రయం పొందుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తండ్రి పైడయ్య ఇంటి బయట పడుకున్నాడు. రవణమ్మ ఇంట్లో ఒంటరిగా పడుకుంది.


అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి రవణమ్మపై దాడి చేశాడు. తలపై రాయితో మోదడంతో ఆమె రక్తపు మడుగులో ఉండిపోయింది. అపస్మారక స్థితిలోకి చేరుకుంది. శనివారం నిద్రలేచిన తండ్రి పైడయ్య చూసి చుట్టుపక్కల వారికి సమాచారమందించాడు. దీంతో స్థానికులు ఆమెను బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ రవణమ్మ మృతిచెందింది. స్థానికులిచ్చిన సమాచారం మేరకు సీఐ శోభన్‌బాబు, ఎస్‌ఐ కృష్ణమూర్తిలు ఘటనాస్థలానికి చేరుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com