ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖేలో ఇండియా విజేతలకు అభినందనలు తెలిపిన సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 09:08 PM

ఖేలో ఇండియా-2022 క్రీడల్లో రాష్ట్రానికి చెందిన కుంజా రజిత 400 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించింది. ఇదే ఈవెంట్‌లో మరో ఏపీ క్రీడాకారిణి పల్లవి మూడో స్థానంతో కాంస్యం అందుకుంది. కాగా, వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో శిరీష 64 కేజీల విభాగంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ గేమ్స్‌లో అద్భుత విజయాలు సాధించినందుకు ఛాంపియన్‌లు రజిత, పల్లవి & శిరీషలకు అభినందనలు తెలిపారు ఏపీ సీఎం జగన్. ఉక్కు సంకల్పం కలిగిన అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్ కి  గర్వకారణంగా నిలిచారు అని తెలిపారు. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా విజయం సాధించడానికి వారి పోరాట స్ఫూర్తి ఎంతోమంది ఔత్సాహికులకు వారి కలలను సాధించడానికి ప్రేరణ అని సీఎం జగన్ అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com