ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడేళ్ళ వైసీపీ పాలనలో ప్రజలు నరకం చూసారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 31, 2022, 01:01 PM

రాష్ట్రానికి వైసీపీ అనే గ్రహణం పట్టి మూడేళ్లు పూర్తయ్యిందని టీడీపీ పొలిటబ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. 30వ డివిజన్ మధ్యకట్ట, పప్పుల కూడలి నుంచి సోమవారం సాయంత్రం పెట్రో ఉత్పత్తులు, నిత్యావసర ధరలపై బాదుడే బాదుడు కార్య క్రమం నిర్వహించారు. ఆయన ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను స్థానికులకు వివరించారు. 


అనంతరం ఆయన మాట్లాడుతూ. ప్రజలు ఎన్నడూ చూడని నరకం ఈ మూడేళ్ల వైసీపీ పాలనలో చూశార న్నారు. ఇసుక దగ్గర మొదలు పెట్టి అన్ని రకాల ధరలు పెంచి ప్రజలపై అధిక భారం మోపారని పేర్కొన్నారు. అభివృద్ధి చేయకుండా, ఉచిత పథ కాలు ఇస్తున్నామని ఆర్భాటాలు చెప్పుకుంటున్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, రాబోయే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయ మన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com