ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ మంత్రి కారును సరస్సులోకి తోసిన నిరసనకారులు

international |  Suryaa Desk  | Published : Fri, May 13, 2022, 08:15 PM

శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఆ దేశ ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. నిత్యవసర వస్తువుల నుంచి అన్ని ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రికి చెందిన కారును కొందరు నిరసనకారులు సరస్సులోకి తోసేశారు. మరి కొందరి నేతల కార్లను కూడా నీటిలోకి తోశారు. పెట్రోల్‌, నిత్యవసరాలతో పాటు అవసరమైన మందులు కూడా లేవని, ప్రజలు ఒక పూట భోజనంతో సరిపెట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నారని ఒక వ్యక్తి వాపోయాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com