వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్కి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్ కౌంటర్ ఇచ్చారు. ''ఎన్నికల్లోఅభ్యర్థులను అధికారంతో బెదిరించి నామినేషన్ విత్ డ్రా చేయించి గెలిచిన గెలుపు ఒక గెలుపేనా?. నల్ల క్వారీల దగ్గర దందాలుచేసే నీకు.. అయ్యన్న గురించి మాట్లాడే అర్హత లేదు. అయ్యన్నకు పెగ్గును రోజు నువ్వేఅందిస్తున్నావా?. పాలన చేత కాదని తప్పుకోండి అప్పుడు మంచి పరిపాలన చంద్రబాబు అందిస్తారు. ఫేక్ ప్రామిస్లతో గద్దెనెక్కి ప్రజల్ని నిలువునా ముంచిన జగన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల రాసలీలలపై చర్చించే దమ్ము మీకు ఉందా?. చంద్రబాబుని తుపాకీతో కాల్చి పారేయాలి జగన్ రెడ్డి అన్న మాటల కన్నా అయ్యన్న మాట్లాడింది మీకు తప్పుగా ఉన్నదా?. అయ్యన్నను విమర్శిస్తే సహించేది లేదు'' అని వ్యాఖ్యానించారు.