గుంటూరు: ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నరసరావుపేట మండలంలోని ఉప్పలపాడు వద్ద శనివారం జరిగింది. 108 సిబ్బంది. కథనం మేరకు మండలంలోని ములకలూరుకు చెందిన నూనె కోటయ్య, మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై పెట్లూరివారిపాలెం వెళ్లి తిరిగి వస్తుండగా ఉప్పలపాడు వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఏరియా వైద్యశాలకు తరలించారు.