కృష్ణా: విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామం బ్రేబ్యూజ్ లో వెనుక ప్రాంతంలో గల ఆస్ట్రల్ పైపుల కంపెనీ లో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగ సంభవించి.. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగిన గోడను ఆనుకొని టిన్నర్ గోడ ఉండడంతో స్థానికులు భయాందోళన చెందారు. కానీ ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ రెండు కోట్లు నష్టం వాటిల్లిందని అంచనా.. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు.