ఖాజీపేట మండల పరిధిలోని నాగపట్నం గ్రామంలో బుధవారం మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాం రెడ్డి సోదరుడు శెట్టిపల్లె చంద్ర శేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి వైసిపి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి మళ్ళీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైస్సార్సీపీ ప్రభుత్వన్ని మెజారిటీతో గెలుపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.