వినాయకచవితి పండగను ఎవరి ఇళ్లలో వారు జరుపుకోవాలని బాపట్ల డిఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం బాపట్లలోని ఆయన కార్యాలయంలో అతని మాట్లాడుతూ వినాయకచవితి పండుగ సందర్భంగా కోరోనా వ్యాధి థర్డ్ వేవ్ ఉన్నదన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బహిరంగ ప్రదేశాలలో వినాయక విగ్రహాలు పెట్టారదని చెప్పారు.
ప్రజలు గుమికూడటం నిమజ్జనం కార్యక్రమాలు చేయడం నిషేదించడమైనదని తెలిపారు. పోలీసు వారి నుండి ఎటువంటి అనుమతి ఇవ్వడంలేదన్నారు.
వినాయక చవితి పండుగను ఎవరి ఇంట్లో వారు వారి కుటుంబ సభ్యులతో చేసుకోవలసిందిగా తెలిపారు. పోలీసు / ప్రభుత్వ ఆదేశాలకు భిన్నముగా ప్రవర్తించిన యెడల వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలందరూ పోలీసు వారి సూచనల ప్రకారం కోరోనా బారిన పడకుండా జాగ్రతలు పాటించవలసిందిగా కోరారు.