టోక్యో వేదికగా జరుగుతున్న పారాలంపిక్స్ 2020లో భారత అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతున్నది. తాజాగా శుక్రవారం జరిగిన హై జంప్ పోటీల్లో వరల్డ్ నెంబర్ 3 ప్రవీణ్ కుమార్ పతకం సాధించాడు. హైజంప్ టీ64 కేటగిరీలో 2.07 మీటర్ల ఎత్తు దూకి రజత పతకం సాధించాడు. ప్రవీణ్ సాధించిన ఈ పతకంతో భారత పతకాల సంఖ్య 11కు చేరింది. వరల్డ్ నెంబర్ 3 ప్రవీణ్ శుక్రవారం 2.07 మీటర్లు దూకి సరికొత్త ఏసియా రికార్డు సృష్టించాడు. కేవలం 2 సెంటీ మీటర్ల తేడాతో ప్రవీణ్ స్వర్ణ పతకం కోల్పోయాడు. బ్రిటన్కు చెందిన జోనాథాన్ బ్రూమ్ ఎడ్వర్డ్స్ 2.10 మీటర్ల ఎత్తు దూకి స్వర్ణ పతకం సాధించాడు. పారాలింపిక్స్ క్వాలిఫికేషన్స్ కొరకు జూనియర్ చాంపియన్షిప్స్లో ప్రవీణ్ కుమార్ 1.92 మీటర్లు దూకి నాలుగో స్థానంలో నిలిచాడు.