ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..ఆ రూల్స్ మారనున్నాయి..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 25, 2021, 04:51 PM

మీరు యాక్సిస్ బ్యాంక్ కస్టమరా, అయితే మీకొక గుడ్ న్యూస్ న్యూస్. చెక్ బుక్ మోసాలను చెక్ పెట్టేందుకు ఆర్‌బీఐ పాజిటివ్ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి విధితమే. అయితే యాక్సిస్ బ్యాంక్ సెప్టెంబర్ 1, 2021 నుంచి పాజిటివ్ పేమెంట్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ పాజిటివ్ పే అమలు గురించి అనేక మంది యూజర్లకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తోంది. బ్యాంకింగ్ రంగంలోని చెక్ మోసానికి కళ్లెం వేసేందుకు జనవరి 1, 2021 నుంచి పాజిటివ్ పే వ్యవస్థను అమలు చేయాల్సిందిగా బ్యాంకులకు ఆర్బీఐ మార్గదర్శకాలను జారీ చేసింది. నిజానికి ఆర్బీఐ 2020లో చెక్ కోసం ''పాజిటివ్ పే సిస్టమ్'' ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. భారీ మొత్తంలో చెల్లింపులకు కీలక వివరాల కోసం రీ-కన్ఫర్మేషన్ అవసరం అయ్యేలా ఈ సిస్టమ్ రూపొందించింది. అయితే ఈ సిస్టమ్ రూ.5 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం చెక్కులకు వర్తిస్తుంది. రూ.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్లియరింగ్‌ కి జరగాలంటే బ్యాంకులు తప్పనిసరి ఖాతాదారుడికి సమాచారం అందిస్తాయి. పాజిటివ్ పే సిస్టమ్ పట్ల కస్టమర్లకు తగిన అవగాహన కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. ఎస్ఎంఎస్ హెచ్చరికల ద్వారా, బ్రాంచ్‌లు, ఏటీఎంలతో పాటు వెబ్‌సైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పాజిటివ్ పే సిస్టమ్‌ గురించి కస్టమర్లకు తెలియజేయాల్సిందిగా ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com