కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఏపీకి మంగళవారం మరో 2 లక్షల కొవాగ్జిన్ డోసులు చేరాయి. హైదరాబాద్ నుంచి మంగళవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి టీకా డోసులు వచ్చాయి. వాటిని అక్కడి నుంచి గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. వైద్యారోగ్యశాఖ ఆదేశాల అనంతరం ఈ వ్యాక్సిన్లను ఆయా జిల్లాలకు తరలించనున్నారు.