వ్యాక్సినేషన్ పై చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. వ్యాక్సిన్లు కొనడం లేదని అనడం సరికాదని అన్నారు. వ్యాక్సిన్లపై కేంద్ర టాస్క్ ఫోర్స్ మానిటరింగ్ చేస్తోందని.. కష్ట సమయంలో చంద్రబాబు నీచ రాజకీయాలు చేయడం సరికాదని మండి పడ్డారు. కరోనా కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. ట్రాన్స్పరెంట్ గా వ్యవహరిస్తోందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తోందని చెప్పారు. కరోనా కట్టడి విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు.