ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేకే లైన్‌లో జారిపడిన బండరాళ్లు.. అప్పుడే గూడ్స్ రైలు రావడంతో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 07:53 PM

అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని కేకే (కొత్తవలస-కిరండోల్‌) లైన్‌లో రైల్వే ట్రాక్‌పై బండరాళ్లు జారి పడ్డాయి. బొడ్డవర-శివలింగపురం రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్‌పై రాళ్లు పడిపోగా.. అదే రూట్‌లో కొద్దిసేపటికి జంబో గూడ్స్‌ ఇంజన్‌ వచ్చింది బండరాయిపైకి ఎక్కి ఒక్కసారిగా ఆగిపోయింది. బొడ్డవర-శివలింగపురం రైల్వే స్టేషన్ల మధ్య 41వ కిలోమీటరు దగ్గర ఈ ఘటన జరిగింది. బండరాళ్లు పడిపోయాయని సమాచారం రావడంతో రైల్వే అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.


బండరాయిపైకి ఎక్కిన ఇంజన్‌ తొలగించి, ట్రాక్‌ పునరుద్ధరణ పనులను చేపట్టారు. అక్కడ విరిగిపోయిన ట్రాక్‌కు సంబంధించిన ఐరన్‌ కమ్మిని మార్చారు. ఈ కారణంగా విశాఖపట్నం నుంచి కిరండోల్‌ వెళ్లాల్సిన పాసింజర్‌ రైలును విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో దాదాపు ఐదు గంటలపాటు నిలిపి వేయాల్సి వచ్చింది. బండరాళ్లు జారిపడే సమయంలో రైలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గతంలో కూడా ఈ కేకే లైన్‌లో బండరాళ్లు పడిపోయి రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ రూట్‌లో వర్షాకాలంలో ఎక్కువగా బండరాళ్లు జారిపడుతుంటాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com