ఏపీలో 104 వ్యవస్థ మరింత బలోపేతం కావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అధికారులు నిత్యం మాక్ కాల్స్ చేసి పనితీరును పర్యవేక్షించాలని అన్నారు. కొవిడ్ ప్రత్యేక అధికారులతో సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు ఆదేశాలు, సూచనలు చేశారు. 104 నంబర్ కు కాల్ చేసిన వెంటనే కచ్చితంగా స్పందించాలని, అవసరమైన వారికి బెడ్డు కేటాయించేలా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కొవిడ్ బాధితుల రద్దీ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పడకలను గణనీయంగా పెంచాలని సూచించారు.