ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాశనం కోసమే సీబీఎన్ 420 వైరస్: కొడాలి నాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 08, 2021, 04:00 PM

కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా కృషి చేస్తోందని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు. ఎవరు చనిపోయినా కరోనాతోనే చనిపోయారని బాబు విష ప్రచారం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. కర్నూల్ లో ఎన్ 440కే వైరస్ ఉందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడు.. కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు నారావారిపల్లెలో సీబీఎన్ 420 అనే వైరస్ పుట్టిందని ఎద్దేవా చేశారు. వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని.. ఈ విషయంలో ఇప్పటికే ప్రధాని మోడీకి, వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకు సీఎం జగన్ లేఖలు సైతం రాశారని అన్నారు. వ్యాక్సిన్ కొరత కారణంగానే టీకాల పంపిణీ నిదానించిందని వెల్లడించారు. కరోనా విజృంభణకు చంద్రబాబు, ఎల్లోమీడియానే కారణమని దుయ్యబట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com