ఇండియా టాప్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిందాబి శ్రీకాంత్ కు ఒలింపిక్స్ ముంగిట గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఒలింపిక్స్ లో అర్హత సాధించేందుకు మిగిలిన చివరి రెండు బ్యాడ్మింటన్ టోర్నీలో ఒకటైన మలేసియా ఓపెన్ సూపర్ 750 టోర్నీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం మే 25న కౌలాలంపూర్ లో ఆరంభం కావాల్సిన ఈ టోర్నీ.. అక్కడ ఏర్పడిన కరోనా పరిస్థితితుల కారణంగా వాయిదా వేసినట్లు బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. అర్హత టోర్నీ అయిన ఇండియా ఓపెన్ ఇప్పటికే వాయిదా పడగా తాజాగా మలేసియా ఓపెన్ సూపర్ సైతం వాయిదా పడింది. దీంతో మిగిలిన సింగపూర్ ఓపెన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే సింగపూర్ ఓపెన్ లో ఆడేందుకు భారత ప్లేయర్లను అనుమతించే విషయంలో సందిగ్ధం ఏర్పడింది. దీంతో ఈ ఇద్దరి ఒలంపిక్స్ అర్హత సాధించడం అనుమానంగా మారింది.