ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునఃపరిశీలన చేసుకోవాలని హైకోర్టు సూచించింది. పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలన్న పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది. పరీక్షల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు భాగం కావాల్సి ఉందని అందువల్ల ప్రభుత్వం ఈ అంశంలో వెంటనే పునః పరిశీలన చేసుకోవాలని సూచించింది. విచారణను మే 3కు వాయిదా వేసిన కోర్టు.. అదే రోజు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది.