కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు విరుచుకుపడింది. ఆక్సిజన్ సరఫరాపై అఫిడవిట్ లో సరైన వివరాలు లేవని కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవిడ్ పై విచారణను సుమోటోగా స్వీకరించిన సుప్రీం వంద శాతం కోవిడ్ వ్యాక్సిన్ లను ఎందుకు కొనుగోలు చేయలేదని, వ్యాక్సిన్ తయారీకి ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించింది. కేంద్రం, రాష్ట్రాలకు వ్యాక్సిన్ అమ్మే ధరల్లో వ్యత్యాసం ఎందుకు అని ప్రశ్నించింది.