అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పోలీసు స్టేషన్ లో ఉన్న నీ హిస్టరీని, నీ రివాల్వర్, మురళీ చనిపోయింది, పోలీసు స్టేషన్ లో మీ డ్రైవర్, నీ ఫోటో పెట్టాలనా అని కౌన్సిలర్ పయాజ్ బాషా పై మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక జేసి స్వగృహంలో విలేకరులతో జేసిప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నీకు భాషలే సరిగా రావు, లేయడం సర్ట్ సర్దుకోవడం, నీవు కుటుంబాన్ని నాశనం చేసావు, మీతమ్ముణ్ణి, మీ అన్న ను నాశనం చేసింది నీవు కదా అని పయాజ్ ను జేసిపీఆర్ ప్రశ్నించారు.
మీ అన్నా మాతోనే ఉన్నాడని.. మీ తమ్మునికి మంచి పేరు ఉంది, మీనాన్న మాతో పనిచేశారన్నారు. మంచి పేరు ఉంది, నీకు ఏముందో నీకే తెలువాలని పయాజ్ ను ఉద్దేశించి జేసిపీఆర్ అన్నారు. యాళ్లనుర్, పుట్లూరు, నంద్యాల రోడ్లలో కోటీశ్వరులు వున్నారు. నీవు బ్రిడ్జి వద్ద ప్లాట్ లు ఇస్తావా, ఎన్ని స్థలాలు ఇచ్చావు, మళ్ళీ జాయింట్ వెంచర్ అంటావు, నీకే అర్థం కాదన్నారు.
మంచిపనులు చేస్తే ప్రజలు మెచ్చుకుంటారని ఎప్పుడు ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ అని గగోలు పెడుతావు ఏదో పెద్దారెడ్డి పుణ్యమా అని కౌన్సిలర్ అయ్యావన్నారు. మంచిపనులు చేసి పేరు తెచ్చుకోవాలని ఆయన హితవు పలికారు. వడ్డీలేని రుణాలు అంటావు, బీడీలు చుట్టేవారు తగ్గిపోయారు, వారికి రుణం ఇచ్చి వారం కూలీ లో వసూలు చేస్తావు ఇదేనా వడ్డీలేని రుణం అని జేసిపీఆర్ పయాజ్ ను ప్రశ్నించారు. పెద్దబజార్ లో ఓ పంచాయతీలో హీరో గా కూర్చున్నావు. ఆ పంచాయతీ తెంచావా..? నాకు రాజకీయం వద్దంటావు, నీవు పెద్దమనిషిగా వెళ్ళావు అపంచాయతీ తెంచావా అని పయాజ్ ను జేసిపీఆర్ ప్రశ్నించారు..