మే 1 నుంచి దేశంలోని 18 ఏళ్లు పై బడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అయితే రిజిస్ట్రేషన్ పై దేశవ్యాప్తంగా ప్రజల్లో అయోమయం నెలకొంది. రిజిస్టేషన్ ప్రారంభమయ్యే సమయం తెలియక చాలా మంది గందరగోళంలో పడ్డారు. అయితే బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 28 న కరోనా వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని మొదట ప్రకటించడంతో చాలామంది అర్ధరాత్రి 12 గంటల నుంచి రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నిస్తూ వస్తున్నారు. 18 ఏళ్లు పైబడినవారందరికీ కోవిన్ రిజిస్ట్రేషన్ (ఆరోగ్యసేతు యాప్, ఉమంగ్ యాప్) 28 వ తేదీ 4 గంటలకు లాంచ్ అవుతుందని కేంద్రం స్పష్టం చేసింది.