కరోనా కేసులు పెరుగుదలతో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా కరోనా వ్యాక్సిన్ అయిన Sputnik-V టీకాకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రష్యా వ్యాక్సిన్ కు డీసీజీఐ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కొరత ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకునట్టు తెలుస్తోంది. దీంతో ఇది కాస్త ఉపశమనం కలిగించే వార్తగా చెప్పవచ్చు.